విద్యార్థులను IT నిపుణులుగా
తయారు చేయటం కాకుండా, రోజువారీ అభ్యసన
ప్రక్రియలో వినియోగించుకుంటూ ఐటి
విద్యను నేర్పడమే తమ
లక్ష్యం అంటున్నారు కేరళ స్టేట్ IT@School
ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్వర్ సాదత్. అక్టోబర్ మొదటి
వారంలో కేరళ రాష్ట్రంలో పర్యటించిన యుటియఫ్
ప్రతినిధి బృందం తిరువనంతపురంలోని
IT@School రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయాన్ని
సందర్శించి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో
గంటన్నరపాటు సంభాషించారు. ఆ సంభాషణలోని
ముఖ్యాంశాలను క్లుప్తంగా
ఇంటర్వ్యూ రూపంలో ఇస్తున్నాము
యుటియఫ్ : కేరళ రాష్ట్రంలో IT
విద్యను ఎప్పుడు ప్రారంభించారు. ఎలా
అమలు జరుపుతున్నారు?
అన్వర్ : పాఠశాలల్లో IT విద్యను 2003
సంవత్సరంలో ప్రారంభించాము. ప్రస్తుతం 4071
ప్రభుత్వ,ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో
IT విద్య బోధించ బడుతున్నది. రాష్ట్ర
ప్రభుత్వం పాఠశాలల్లో IT విద్యా బోధన
కోసం ప్రత్యేకంగా IT@School అనే
ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్
ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 8 నుండి 12
తరగతుల విద్యార్థులు 15 లక్షలమందికి |ఊ
విద్యను అందజేస్తున్నాము. ఈ
సంవత్సరం 5,6,7 తరగతులలోని మరొక 15
లక్షల మందికి |ఊవిద్యను ఎన్ఎస్ఏ సహకారంతో
అందించనున్నాము.
యుటియఫ్ : IT విద్యను ప్రత్యేక
సబ్జెక్టుగా బోధిస్తున్నారా? టీచర్ను ప్రత్యేకంగా
నియమించారా?
అన్వర్ : లేదు. కంప్యూటర్ విద్య (IT
విద్య)ను ప్రత్యేకంగా బోధించటంలేదు. మా
ప్రాజెక్టు లక్ష్యం కంప్యూటర్
నిపుణులను తయారు చేయటం కాదు.
కంప్యూటర్ ఆధారంగా సమాచార సాంకేతిక
పరిజ్ఞానాన్ని అన్ని సబ్జెక్టులలో వినియోగించుకొని
ఆయా సబ్జెక్టులలో
నైపుణ్యం సంపాదించుకోవటం మా ముఖ్య
ఉద్దేశ్యం. IT విద్య కోసం ప్రత్యేకంగా
ఉపాధ్యాయులను నియమించలేదు. పాఠశాలల్లోని
ఉపాధ్యాయులందరికీ ఐ.టి. విద్యా బోధనలో
శిక్షణనిచ్చాము. మళయాళం, ఇంగ్లీష్, (భాషలు),
గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులలోని పాఠ్య
బోధననలో ఐటి వినియోగం పై శిక్షణనిచ్చాము.
ఐ.టి. విద్యా బోధన కోసం ప్రత్యేకంగా
టీచర్లను నియమిస్తే అది ఆ టీచర్కు,
కంప్యూటర్ లాబ్కే పరిమితం అవుతుంది.
సహజంగానే ఇతర టీచర్లు ఐటి వినియోగానికి
దూరంగా ఉంటారనేది మాకున్న అవగాహన అందుకే
మేము అందరు టీచర్లకు ఐటి విద్యను తమ
సబ్జెక్టులలో ఎలా వినియోగించి బోధించాలో శిక్షణ
ఇచ్చాము. ఇది మంచి ఫలితాలనిచ్చింది.
యుటియఫ్ : ఉపాధ్యాయులకు ఎన్ని
రోజులు శిక్షణ ఇస్తారు? ఎవరి ద్వారా ఇస్తారు?
మాడ్యూల్స్ ఏవైనా రూపొందించారా?
అన్వర్ : తొలిదశలో 10 రోజులు ఇవ్వాల్సి
వచ్చింది. కానీ ప్రస్తుతం 6 రోజుల శిక్షణ
సరిపోతున్నది. 5 రోజులు ఐటి విద్య ఒక
రోజు వారి సబ్జెక్టులో ఐటి వినియోగంపై శిక్షణ
ఇస్తాము. IT@School ప్రాజెక్ట్ ద్వారా ఎంపిక
చేయబడిన 150 మంది ఉపాధ్యాయులను మాస్టర్
ట్రైనర్లుగా పిలుస్తాము. వీరికి ముందుగా ఐటి
నిపుణులతో ప్రాజెక్టు స్థాయిలో 10 రోజుల
పాటు శిక్షణ ఇప్పించాము. వీరు రాష్ట్రంలోని
152 సబ్ డిస్ట్రిక్ట్ (డివిజన్) కేంద్రాలలో
ఉపాధ్యాయులందరికీ శిక్షణనిస్తారు. శిక్షణ
కోసం ప్రతి సబ్జెక్టులో ట్రైనింగ్ మాడ్యూల్స్
రూపొందించాము. కేవలం ఐటి విద్యపై శిక్షణే
కాకుండా కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటనెన్స్,
కెపాసిటీ బిల్డింగ్, ఇంటర్నెట్ వినియోగం తదితర
అంశాలపై కూడా శిక్షణనిస్తాము.
యుటియఫ్ : ఈ 6 రోజుల శిక్షణే
ఉపాధ్యాయులకు సరిపోతుందా?
అన్వర్ : సరిపోతుంది. మేము రూపొందించిన
మాడ్యూల్ను బోధించడానికి సబ్జెక్టుపైన
అవగాహన ఉంటే 2 రోజులు చాలు. దీంతో పాటు వారికి
నిరంతరం ఓరియంటేషన్
కల్పించేందుకు IT@School ఆధ్వర్యంలో
ప్రత్యేకంగా విద్యా కార్యక్రమాల కోసమే
"Edusat" అనే చానెల్ కూడా వుంది. దీని ద్వారా
పాఠశాలలతోను అధికారులతోను వీడియో
కాన్ఫరెన్స్లను నిర్వహిస్తాము. మరొక
విశేషమేమంటే విద్యాకార్యక్రమాల
కోసం ''విక్టర్స్''అనే టి.వి. చానెల్ను కూడా
నిర్వహిస్తున్నాము.
యుటియఫ్ : ఒక్కొక్క పాఠశాలకు ఎన్ని
కంప్యూటర్లు ఇచ్చారు?
అన్వర్ : ఒక్కక్క పాఠశాలకు విద్యార్థుల
సంఖ్యను బట్టి 10 నుండి 65
వరకు కంప్యూటర్లు ఇచ్చాము. ప్రతి
స్కూల్కు ప్రింటరు, ల్యాప్టాప్, మల్టీమీడియా
ప్రొజ్టెరు అవసరమైన చోట జనరేటర్ కూడా సరఫరా
చేశాము. 400 పాఠశాలలకు హ్యాండీకామ్లు కూడా
ఇచ్చాము. బిఎస్ఎన్ఎల్ సహకారంతో అన్ని
పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్
సౌకర్యం కల్పించబడింది. యుటియఫ్ : ఈ
పరికరాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎలా
వినియోగిస్తున్నారు.?
అన్వర్ : అన్ని పాఠశాలల్లో చాలా సమర్థవంతంగా
వినియోగిస్తున్నారు. మీకు సమయం ఉంటే కొన్ని
పాఠశాలను సందర్శించి స్వయంగా
పరిశీలించవచ్చు. ప్రతి స్కూల్కు కంప్యూటర్
ల్యాబ్ ఉంటుంది. ప్రతి టీచర్ అవసరాన్ని బట్టి
క్లాస్రూమ్కు ల్యాప్టాప్, ప్రొజెక్టర్ తీసుకువెళ్ళి
పాఠ్య బోధనలో వినియోగించుకుంటారు. ఇంటర్నెట్
ఉండటం వల్ల పాఠ్యాంశాల బోధనకు అవసరమైన
సమాచారాన్ని కూడా ఇంటర్నెట్ ద్వారా
సేకరించుకుంటారు.
యుటియఫ్ : IT ఆథారిత విద్యా
బోధనకు ఉపాధ్యాయుల సంసిద్ధత /
సహకారం ఎలా వుంది?
అన్వర్ : చక్కగా వుంది. ప్రభుత్వ పాఠశాలల్లో
నమోదు రేటు క్రమంగా తగ్గుతున్న తరుణంలో
ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవాలనే పట్టుదల
ఉండటం వల్లనూ, పరీక్షలలో ప్రతి
సబ్జెక్టులోను ఐటి విద్యకు సంబంధించిన
ప్రశ్నలకు,
ప్రాక్టికల్స్కు మార్కులు కెటాయించబడటం వల్లనూ,
ఉపాధ్యాయులందరూ ఐటి విద్యా
బోధనకు మానసికంగా సిద్ధమయ్యారు. ఒకసారి
అవగాహన కల్గిన తర్వాత బోధన సులభంగా
ఉండటం వల్ల ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా
సహకరిస్తున్నారు. కొందరైతే వారికిగల
సృజనాత్మకతను జోడించి క్లాస్రూమ్లో ఐటి
వినియోగంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
యుటియఫ్ : ఐటి విద్యకు నిధులు ఎలా
సమకూర్చ బడుతున్నాయి?
అన్వర్ : ఐసిటి ఎడ్యుకేషన్ పేరుతో కేంద్ర
ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు 75%
నిధులను కెటాయిస్తున్నది. మిగిలిన 25%
శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. రాబోయే
5 సం||ల కాలానికి ప్రతి పాఠశాలకు రు.1.33
లక్షలు చొప్పున
నిధులు కెటాయించబడుతున్నాయి. అయితే ఇవి
హైస్కూల్స్ కోసం మాత్రమే పరిమితమైనవి. కానీ
మేము ఎస్ఎస్ఏ సహకారంతో ఈ సంవత్సరం నుండి
యుపిఎస్లలో 5,6,7 తరగతుల
విద్యార్థులకు కూడా ఐటి
విద్యను బోధిస్తున్నాము. మౌలిక వసతుల
కల్పన కోసం పిటిఏ సహకారం కూడా
తీసుకుంటున్నాము.
యుటియఫ్ : కంప్యూటర్ విద్యా బోధనపై
పర్యవేక్షణ ఏమైనా ఉందా?
అన్వర్ : తప్పకుండా ఉంది. రాష్ట్ర స్థాయిలో
IT@School ప్రాజెక్ట్, జిల్లా స్థాయిలో ప్రతి
జిల్లాకు ఒక కో-ఆర్డినేటర్ (వీరూ టీచర్లే), బ్లాక్
స్థాయిలో మాస్టర్ ట్రైనర్లు, పాఠశాల స్థాయిలో
స్కూల్ కో-ఆర్డినేటర్లు ఉంటారు. కంప్యూటర్ల
నిర్వహణతోపాటు, ఉపాధ్యాయులకు అవసరమైన
సాంకేతిక సహకారాన్ని వీరు అందిస్తారు.
యుటియఫ్ : కంప్యూటర్ల నిర్వహణ,
రిపేర్లు ఎవరు చూస్తారు?
అన్వర్ : మెయింటనెన్స్తోపాటు చిన్న చిన్న
రిపేర్లు స్కూల్ కో-ఆర్డినేటర్లే చూస్తారు. వారికి
ఆ విధంగా శిక్షణ ఇస్తాము. మేజర్ రిపేర్ల
నిర్వహణ కోసం ''కెల్ట్రాన్'' అనే ప్రభుత్వరంగ
సంస్థ సహకారంతో ''హార్డ్ వేర్
క్లినిక్''లను ఏర్పాటు చేశాము. పరిసరాల్లోని
పాఠశాలల నుండి చెడిపోయిన
యంత్రాలను క్లినిక్లకు తీసుకువచ్చి రిపేర్
చేయించుకువెళతారు. గత సంవత్సరం 1000
పాఠశాలలకు సంబంధించిన 8000
కంప్యూటర్లను ఈ క్లినిక్లలో రిపేర్
చేయించాము. ఇందుకోసం అయిన ఖర్చు రు. 1.2
కోట్లు. ఆ విధంగా చేయడం వల్ల సుమారు 12
కోట్లు (10రెట్లు) ఆదా చేయగలిగాము.
యుటియఫ్ : కంప్యూటర్లలో ఏ సాఫ్ట్వేర్
వినియోగిస్తున్నారు?
అన్వర్ : లీనక్స్ ''ఫ్రీ సాఫ్ట్వేర్''.
2005కు పూర్వం మైక్రోసాఫ్ట్ కంపెనీ ''విండోస్''
సాఫ్ట్వేర్ ఉపయోగించే వారం. బహుళజాతి సంస్థ
అయిన ఆ కంపెనీ గుత్తాధిపత్యం వల్ల
సాఫ్ట్వేర్ కొనుగోలు కోసమే పెద్ద మొత్తంలో
నిధులు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి
వ్యతిరేకంగా కేరళ స్టేట్ టీచర్స్ అసోసియేషన్
(కెఎస్టిఏ) ఫ్రీ సాఫ్ట్వేర్ను వినియోగించాలని
డిమాండ్చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద
ఉద్యమం నిర్వహించింది. ఫలితంగా అప్పటి
యుడిఎఫ్ ప్రభుత్వం 2005 నుండి ఫ్రీ సాఫ్ట్వేర్
వినియోగాన్ని ప్రారంభించింది. 2005-2006
సంవత్సరములలో ఫ్రీ సాఫ్ట్వేర్, విండోస్
రెండూ వినియోగంలో ఉన్నాయి. 2007 నుండి
పూర్తిగా ''ఫ్రీ సాఫ్ట్ వేర్'' మాత్రమే
వినియోగించబడుతున్నది. దీని వల్ల మా
ప్రభుత్వానికి ఖర్చు తగ్గింది.
వినియోగదారులకు స్వీచ్చ లభించింది.
యుటియఫ్ : కంప్యూటర్ విద్యా బోధనలో ఇతర
రాష్ట్రాలతో పోలిస్తే మీ దగ్గర సమర్థవంతంగా
అమలు జరుగుతుందని భావిస్తున్నారా?
అన్వర్ : అవును.
నేను కాదు బెంగుళూరుకు చెందిన ఐటి ఫర్ చేంజ్
అనే సంస్థ కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఐటి
విద్యా బోధనపై నిర్వహించిన సర్వేలోనే ఈ
విషయం వెల్లడైంది. ఆ రిపోర్టును ఇంటర్నెట్లో
మీరు కూడా చూడవచ్చు.
యుటియఫ్ : ఐటి విద్య మీ వద్ద ఎందుకింత
సమర్థవంతంగా అమలు జరుగుతున్నది?
అన్వర్ : కేవలం ప్రభుత్వ ఆధీనంలో
నిర్వహించబడటం, ఫ్రీ సాఫ్ట్వేర్ వినియోగం,
ఉపాధ్యాయులందరినీ
భాగస్వాములను చేయడం వల్లనే ఇది
సాధ్యమైందనుకుంటాను. ఇతర రాష్ట్రాలలో
ఎన్ఐఐటి లాంటి ఏ ప్రైవేట్ సంస్థ కో-
కాంట్రాక్ట్కు ఇస్తున్నారు. వారు 4,5 ఏళ్ళ
పాటు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో పాఠశాలల్లో
కంప్యూటర్ ల్యాబ్లు నిర్వహిస్తారు. ఐటి
విద్య ఒక ప్రత్యేక సబ్జెక్టుగా వారానికి 2,3
పిరియడ్లు బోధిస్తారు. ఇతర
టీచర్లకు కంప్యూటర్లతోగాని, ఐటి విద్యతోగానీ
సంబంధం వుండదు. ఈ పరిమితమైన శిక్షణతో
విద్యార్థులు కంప్యూటర్ నిపుణులుగా కూడా
తయారు కాలేరు. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత
ఐటి టీచర్లు వెళ్ళిపోతారు.
కంప్యూటర్లు సర్వీసింగ్ లేక మూలన
పడతాయి. వాటిని పర్యవేక్షించే నాధుడే వుండడు.
బహుశా ఈ ఇబ్బందులేవీ మాకు లేనందు వల్లనే
మా రాష్ట్రంలో ఐటి విద్య సమర్థవంతంగా
అమలు జరుగుతున్నదని భావిస్తున్నాను.
యుటియఫ్ : విక్టర్స్ (VICTERS) టి.వి.
చానెల్ను కేరళ రాష్ట్ర
ప్రభుత్వం నిర్వహిస్తుందా? ఆ చానెల్లో ఏ
కార్యక్రమాలు ప్రసారం చేస్తారు ?
అన్వర్ : అవును. కేరళ ప్రభుత్వ సంస్థ
IT@School ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో
నిర్వహించబడుతుంది. రోజుకు 17 గంటలు (ఉ||
6 నుండి రా|| 11 గంటల వరకు) విద్యా,
వైజ్ఞానిక, వినోదాత్మక
కార్యక్రమాలు ప్రసారం చేస్తాము. (టి.వి. ఆన్
చేసి ''విక్టర్స్ చానెల్లో ప్రసారమౌతున్న
కార్యక్రమాన్ని చూపించారు) విక్టర్స్ అంటే
''వర్చ్వల్ క్లాస్రూమ్ టెక్నాలజీ ఆన్ ఎడ్యుశాట్
ఫర్ రూరల్ స్కూల్''. ఈ ఛానెల్లో మళయాళం,
ఇంగ్లీష్ భాషలలో విద్యా
కార్యక్రమాలు ప్రసారం చేస్తాము. కార్యక్రమాల
రూపకల్పన కోసం ప్రత్యేకంగా స్టూడియో కూడా
వుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
సహకారంతో సందేశశాత్మక
సినిమాలను ప్రసారం చేస్తున్నాము. సినిమా
ప్రసారాన్ని గత వారమే (సెప్టెంబర్ చివరి వారం)
రాష్ట్ర విద్యామంత్రి ఎంఏ బేబి ఆవిష్కరించారు.
జర్మన్ రేడియో ''దోషేవిల్లే''తో 200 గంటల
వీడియో కాంటెంట్ కోసం ఒప్పందం చేసుకున్నాము.
బి.బి.సి.తో కూడా
ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నాము. ఇంకా
రాష్ట్ర వ్యాప్తంగా యూత్ పెస్టివల్ సందర్భంగా
10 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను లైవ్
ఇస్తాము, పాఠశాలల్లో నిర్వహించే
కార్యక్రమాలను రికార్డు చేసి
అప్పుడప్పుడు ప్రసారం చేస్తుంటాము.
పాఠశాలల్లో విద్యార్థుల చేత సృజనాత్మక
కార్యక్రమాలను రూపొందించేందుకు వీడియో
షూటింగ్ కోసం 400 హైస్కూళ్ళకు ''హ్యాండీ
క్యామ్''లను కూడా ఇచ్చాము.
యుటియఫ్ : ఈ కార్యక్రమాలన్ని
విద్యార్థులకు మాత్రమే పరిమితమా? వారికి ఎలా
అందుబాటులో ఉంటాయి.?
అన్వర్ : విక్టర్స్ చానెల్లో ప్రసారమయ్యే
కార్యక్రమాలు కేవలం విద్యార్థులకు మాత్రమే
పరిమితం కాదు. ఉపాధ్యాయులు,
తల్లిదండ్రులు, సాధారణ ప్రజానీకానికి కూడా
ఉపయోగకరంగాను, ఆసక్తిదాయకంగాను ఉంటాయి.
ఈ చానెల్ను లోకల్ కేబుల్ టివిలలో
ప్రసారం చేస్తున్నందు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా
అందరికీ అందుబాటులో ఉంటున్నది. రండి మా
స్టూడియోను ఒకసారి చూద్దాం. (ప్రాజెక్ట్
కార్యాలయంలోనే ఉన్న ''విక్టర్స్'' టి.వి.
స్టూడియోలోనికి తీసుకువెళ్ళి చూపించారు)
అనంతరం యుటియఫ్ బృందం అభ్యర్ధన
మేరకు తిరువనంతపురం జిల్లా IT@School కో-
ఆర్డినేటర్ సాంబశివన్ను తోడు చేసి వారిని
సమీపంలోని కాటన్ హిల్స్ గవర్నమెంట్ గరల్స్
హైస్కూల్ సందర్శనకు పంపించారు. ఆ పాఠశాలలోని
కంప్యూటర్ ల్యాబ్స్ను పరిశీలించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ చెప్పిన
విషయాలను ప్రత్యక్షంగా గమనించి
ధృవీకరించుకున్నారు.
07 July, 2014
ఐటీ వినియోగంతో పురోగమన దిశలో కేరళ విద్యారంగం :: A.P.U.T.F
ఐసీటీ వినియోగంతో అద్భుత ఫలితాలు :: Sakshi Family - July 06, 2014
్
అనిల్ కకోద్కర్.. ప్రపంచ ప్రఖ్యాత
అణు శాస్త్రవేత్త. భారత అణుశక్తి
సంఘం చైర్మన్గా పనిచేసి అంతర్జాతీయ
గుర్తింపు పొందారు. తొలుత బాబా అటామిక్ రీసెర్చ్
సెంటర్ (బార్క్)లో రియాక్టర్ ఇంజనీరింగ్ విభాగంలో
చిరుద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఆయన..
డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. భారత్ పరీక్షించిన
రెండు అణ్వస్త్ర ప్రయోగ పరీక్షల్లో
పాల్పంచుకున్నారు.
మరోవైపు విద్యారంగంలోనూ కకోద్కర్ తన విశిష్ట
సేవలను అందిస్తున్నారు. ఐఐటీ వంటి సంస్థల్లో
చేపట్టాల్సిన సంస్కరణల కమిటీకి
నేతృత్వం వహించి.. ఐఐటీల పురోభివృద్ధికి ఎన్నో
సిఫార్సులు చేశారు. మన దేశంలో విద్యా
విధానం అద్భుత ఫలితాలు సాధించాలంటే..
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ
(ఐసీటీ)ని వినియోగించుకోవాలి, బోధన పద్ధతుల్లో
కూడా మార్పులు రావాలి అంటున్న పద్మవిభూషణ్
అవార్డు గ్రహీత అనిల్ కకోద్కర్తో ప్రత్యేక
ఇంటర్వ్యూ..
బరవాని గ్రామం నుంచి బార్క్ డెరైక్టర్ వరకు మీ
ప్రస్థానం గురించి చెప్పండి?
మధ్యప్రదేశ్లోని బరవాని నా స్వగ్రామం.
ఖర్గోనేలో పాఠశాల విద్య పూర్తి చేశాను. కాలేజ్
ఎడ్యుకేషన్ కోసం ముంబై రావడం నా జీవిత
గమ్యాన్నే మార్చింది. వాస్తవానికి
ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ఫిజిక్స్లో
ఉన్నత విద్య అభ్యసించాలనుకున్నా. అయితే,
అప్పట్లో యూనివర్సిటీలో స్టూడెంట్ పాలిటిక్స్
కారణంగా ఫిజిక్స్లో నాణ్యమైన
బోధనను ఆశించలేమని కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్
చెప్పారు. దాంతో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో
అడుగుపెట్టాను. ఇందులో గ్రాడ్యుయేషన్ పూర్తి
కాగానే.. రొటీన్కు భిన్నమైన అవకాశాల
కోసం అన్వేషణ కొనసాగించా. ఆ సమయంలో బాబా
అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క)లో
ఉద్యోగం లభించింది. ఇది నా కెరీర్ పరంగా
అత్యంత కీలకమైన మలుపు. నేనేంటో
నిరూపించుకునే విధంగా బార్క్లో
అవకాశాలు లభించాయి. ఆ క్రమంలో అణుశక్తిని
అభివృద్ధి చేసే విషయంలో ఎన్నో ఎసైన్మెంట్స్
చేయగలిగాను. ఇప్పటికీ.. కొత్తగా ఆలోచించే వారికి
బార్క్లో అవకాశాలకు ఆకాశమే హద్దు.
మీ కెరీర్లో చిరస్మరణీయమైన విజయం?
ఎవరి కెరీర్లోనైనా ముఖ్యంగా సైన్స్ అండ్
టెక్నాలజీకి సంబంధించి తొలి అసైన్మెంట్
చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఫ్లేమ్
స్ప్రేయింగ్ ఉపయోగిస్తూ లోహ పదార్థంపై
అల్యూమినియం కోటింగ్ విధానాన్ని వృద్ధి
చేయడం నా తొలి అసైన్మెంట్. పూర్తిగా ఎవరి
ప్రమేయం లేకుండా దీన్ని స్వయంగా వృద్ధి
చేశాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేది. ఆ
తర్వాత ధ్రువ రియాక్టర్ ఆవిష్కరణలో
పాల్పంచుకున్నాను. మద్రాస్ అటామిక్ పవర్
స్టేషన్లో రియాక్టర్ల రిహాబిలిటేషన్.. 1974,
1998లలో పోఖ్రాన్ అణు పరీక్షల్లో భాగస్వామిని
కావడం వంటివి మరికొన్ని చిరస్మరణీయ
మైలురాళ్లు.
విద్యారంగానికి సంబంధించి.. ఇంజనీరింగ్
గ్రాడ్యుయేట్గా.. ప్రస్తుత ఇంజనీరింగ్ అండ్
టెక్నాలజీ విద్యా విధానంపై మీ అభిప్రాయం?
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో
విద్యార్థులను కేవలం లేబొరేటరీలు, క్లాస్
రూంలకే పరిమితం చేయడం సరికాదు. రీసెర్చ్పై
అవగాహన కల్పించాలి. సాంకేతిక ఉత్పత్తులు/
ప్రక్రియలపై సంబంధిత నైపుణ్యాలు అలవర్చాలి.
ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి వివరించాలి.
క్షేత్రస్థాయి పద్ధతుల ద్వారా ఆహ్లాదకరమైన
అభ్యసన విధానాన్ని అందుబాటులోకి తేవాలి. క్లాస్
రూం వాతావరణం కూడా రియల్లైఫ్ వర్క్
కల్చర్కు దగ్గరగా ఉండేలా చూడాలి. దీనివల్ల
విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన
లభిస్తుంది.
ఐఐటీలు ప్రతి ఏటా 10 వేల
పీహెచ్డీలు ప్రదానం చేసే విధంగా
చర్యలు చేపట్టాలని సిఫార్సు చేశారు. ఇది
ఆచరణ సాధ్యమేనా?
నేను ఇలా సిఫార్సు చేయడానికి బలమైన
కారణం ఉంది. దేశ జీడీపీ వృద్ధికి, ఇంజనీరింగ్,
సైన్స్ అండ్ టెక్నాలజీల్లో పరిశోధనలకు మధ్య
గట్టి సంబంధం ఉంది. మన దేశ భౌగోళిక
స్వరూపం, ప్రపంచస్థాయిలో పోటీ, అభివృద్ధి దిశగా
ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారీ
సంఖ్యలో పీహెచ్డీల అవసరం ఉంది. దీన్ని
దృష్టిలో ఉంచుకునే ఐఐటీ సంస్కరణల కమిటీ
చైర్మన్గా.. పది వేల పీహెచ్డీలు అనే అంశాన్ని
సిఫార్సు చేశాను. ప్రస్తుతం ఐఐటీల నుంచి
మూడు వేల మంది ఏటా
పీహెచ్డీలు అందుకుంటున్నారు. త్వరలోనే
ఐఐటీలు పదివేల పీహెచ్డీల మైలు రాయికి
చేరుకుంటాయని ఆశిస్తున్నాను. ఈ విషయంలో
టెక్నాలజీపై ఆధారపడి కార్యకలాపాలు సాగించే
పారిశ్రామిక, ఆర్థిక విభాగాలు తమ
భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించాలి.
ఐఐటీ సంస్కరణల కమిటీ చైర్మన్గా ఎన్నో
సిఫార్సులు చేసినా.. ఆర్థిక స్వయం ప్రతిపత్తికి
సంబంధించిన సిఫార్సును ఐఐటీ గవర్నింగ్ కౌన్సిల్
వ్యతిరేకించడంపై మీ అభిప్రాయం?
మా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఎన్నో ఇప్పటికే
అమలవుతున్నాయి. ఆర్థికపరమైన కోణంలో
విశ్లేషిస్తే..
ప్రభుత్వం నిరంతరం విద్యకు కేటాయింపులు పెంచుతోంది.
అందరికీ నాణ్యమైన విద్య లభించాలి. ప్రపంచ
స్థాయీ ప్రమాణాలు కూడా అందుకోవాలి. ఇలా
జరగాలంటే బడ్జెట్లో విద్యకు కేటాయించే
నిధులను భారీ స్థాయిలో పెంచాలి. నిర్దేశిత
ఫీజులు చెల్లించగలిగేవారు, రుణ
సదుపాయం లభించేవారికీ
ఫీజు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదనేది మా
ఉద్దేశం. కెరీర్ అవకాశాలు, ఉపాధి కచ్చితంగా
లభించే ఐఐటీల మాదిరిగానే ఇతర
ఇన్స్టిట్యూట్లను అభివృద్ధి చేయాలి. ఈ దిశగా
బడ్జెట్ కేటాయింపులు పెంచాలని సూచన చేశాం.
స్థూలంగా ఐఐటీ సంస్కరణల కమిటీ ఉద్దేశం..
మానవ వనరుల అభివృద్ధితోపాటు పరిశ్రమలకు,
సమాజాభివృద్ధికి దోహదం చేసే విధంగా బడ్జెట్
కేటాయింపులు చేయడం.
ఉన్నత విద్యాభివృద్ధికి దూర విద్య
విధానం దోహదం చేస్తుందని మీరు అన్నారు.
దూరవిద్య ద్వారా నాణ్యతను ఆశించగలమా?
మనం ఎ-3(ఎనీ వన్, ఎనీ వేర్, ఎనీ టైమ్)
అనుసంధాన, లైఫ్లాంగ్ లెర్నింగ్ అవకాశం గల
విజ్ఞానాధారిత సమాజంలో ఉన్నాం. ఉన్నత విద్యలో
ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీల మధ్య
క్రెడిట్ ట్రాన్స్ఫర్ సదుపాయాన్ని అందుబాటులోకి
తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇదే సమయంలో
అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి
దూరవిద్యా విధానం ద్వారా మరింత మందికి
ఉన్నత విద్యను అందుబాటులోకి తేవచ్చు.
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ
ఆధారంగా.. సమీకృత కృషితో దూర
విద్యలోనూ నాణ్యతను పెంపొందించొచ్చు.
దేశంలో ప్రస్తుత పరిశోధనలపై మీ అభిప్రాయం?
మన దేశ జనాభా, సమాజాభివృద్ధికి సరిపోయే
స్థాయిలో పరిశోధకులు లేరు. పరిశోధకులు, రీసెర్చ్
పబ్లికేషన్స్ ఇటీవల కాలంలో
పెరుగుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని విభాగాల్లో అవి
మరింత పెరగాల్సి ఉంది. ఈ క్రమంలో సమాజాన్ని,
పరిశ్రమలపై ప్రభావం చూపే విధంగా
అనుసంధానం చేయడం, భారతీయ లేబొరేటరీల్లో
పరిశ్రమ పెట్టుబడులు పెంచడం, రీసెర్చ్ను కెరీర్
ఆప్షన్గా ఎంచుకునే విధంగా భారీ సంఖ్యలో యువ
విద్యార్థులను ఆకర్షించుకునే
చర్యలు తీసుకోవడం వంటివి చేపట్టాలి.
జాతీయస్థాయి ఇన్స్టిట్యూట్లలోనే రీసెర్చ్
కార్యకలాపాలు సాగుతున్నాయి. కానీ రాష్ట్రస్థాయి
యూనివర్సిటీల్లో ఈ పరిస్థితి కనిపించట్లేదు.
దీనికి కారణం?
రీసెర్చ్లో కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలే కాకుండా..
సానుకూల దృక్పథంతో కూడిన మద్దతు ఎంతో
అవసరం. ఇన్స్టిట్యూట్లు వాటంతటవే స్వీయ
పరిశోధనలు సాగించే విధంగా చర్యలు చేపట్టాలి.
పరిశ్రమ బృందాలతో అనుసంధానం కావాలి.
యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ నివేదిక
పేర్కొన్నట్లు 2015- 2050 మధ్య కాలాన్ని
డెమోగ్రాఫిక్ ఆపర్చునిటీ విండోగా
వినియోగించుకోవాలంటే?
భారతీయులందరికీ సాధికారికత కల్పించే విధంగా
వీలైనంత త్వరగా నూతన విద్యా విధానానికి
రూపకల్పన చేయాలి. ప్రస్తుతం మనం ఎ-3
విధానంలో ఉన్నాం. కాబట్టి ఇది సులభమే. అదే
విధంగా దేశంలోని అభివృద్ధి
కార్యకలాపాలను విద్యా విధానంతో
అనుసంధానం చేయాలి. స్కిల్స్, ప్రొసీజరల్,
ట్రెడిషనల్ నాలెడ్జ్ ముఖ్య భూమిక పోషించే
విధంగా విద్యను బలోపేతం చేయాలి. బోధన,
నిర్వహణ పరంగా ఇన్ఫర్మేషన్ అండ్
కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రాధాన్యాన్ని బాగా
పెంచాలి.
నూట ఇరవై కోట్ల జనాభా ఉన్న దేశంలో కింది
స్థాయి నుంచి విద్యాభివృద్ధికి మీరిచ్చే సూచన?
సాంకేతికత, ఐటీ వనరుల నేపథ్యంలో కంటెంట్
డెవలప్మెంట్, నిర్వహణ విషయంలో ఐసీటీ
అమలుతో అన్ని వర్గాల వారికి విద్యను సులభంగా
అందుబాటులోకి తేవొచ్చు. అంతేకాకుండా ప్రస్తుత
గ్లోబలైజేషన్ యుగంలో.. ఇప్పటికీ
మనం అనుసరిస్తున్న మెకాలే తరం నాటి పురాతన
ప్రతిబంధకాలు, బ్యూరోక్రసీ, రాజకీయ బంధనాల
నుంచి విముక్తి కల్పిస్తే విద్యా రంగంలో
అద్భుతాలు సృష్టించొచ్చు.
నేటి తరం విద్యార్థులకు మీరిచ్చే సలహా?
ఇంటర్నెట్ యుగం, టెక్నాలజీ
విప్లవం రాజ్యమేలుతున్న ప్రస్తుత
పరిస్థితుల్లో విద్యార్థులు కేవలం పుస్తకాలు,
ప్రయోగశాలలకే పరిమితం కాకుండా.. ప్రాపంచిక
జ్ఞానాన్ని సముపార్జించేలా ముందడుగు వేయాలి.
06 July, 2014
G.O.Ms.No.105, Dt. 2.6.11 :: Former employs of Local bodies who are appointed through APPSC/DSC on or after 10-12-04 are eligible for pay Protection under FR22(a)
G.O. Ms. No.105, Dt.02-06-2011 :: Employees of local bodies who were appointed through
A.P.P.S.C./D.S.C., in Govt. Service are eligible for pay protection
References:
1. Representation of A.P. Secretariat Association, Hyderabad Dt. 8-10-2010 and 15-4-2011.
2. G.O.Ms.No.472, G.A. Dept. dated 23-7-1968
3. G.O.Ms.No.653, G.A. dept. dt. 29-10-1968
4. G.O.Ms.No.168, Panchayat Raj (Estt.III) Dept,dt.20-3-1981.
5. G.O. Ms. No. 213, Finance (FR.II) dept., dt. 13-7-1983
6. G.O. Ms.No.297, Finance Dept. dt. 14-10-1996
O R D E R:
In the reference 1st read above, the A.P. Secretariat Association, Hyderabad has
stated that certain employees have appeared for competitive examinations conducted by
APPSC and got selection for different posts i.e., ASOs. in Secretariat, as Senior
Accountants or equal cadres in the Directorates etc., in the Government service. Before
entering into Government Service they had rendered long service in post falling under jurisdiction of local bodies . It has been represented that they were drawing much higher pay than the minimum of the time Scale of Pay in the present posts for which they are freshly recruited under Government service. After joining in the present Government posts they have not been allowed service benefits like pay protection, carry forward of leave and counting of past service for pension for the reason that they are not covered
under FR 22(a)(iv). It has been represented that this refusal is causing much heart burning and hardship to employees who had worked earlier under local bodies and been recruited to the posts in the Government. It was further stated that all service conditions of the employees of local bodies and employees in Government are similar in nature and the services of the local bodies were.provincialised in G.O.Ms.No. 168, P.R. (Estt.III)
Dept., dt. 20-3-1981. As the salaries of the employees of local bodies are being drawn
under the Head “010. Salaries’ from out of the consolidated fund of the State, the Association requested to allow pay protection for all the employees recruited through APPSC irrespective of the post from which they came.
2. According to the orders issued in G.O. 2nd read above Govt. employees have been declared ineligible for direct recruitment. The said rule has been amended in G.O.3rd read above and Government permitted govt. employees to apply for direct
recruitment and further Govt. employees have been permitted to retain all other benefits accrued to them in the previous posts except the lien. In G.O. 5th read above, orders have been issued for protection of pay stipulating that the pay in the new post should not be less than the pay drawn by the Government servant in their earlier post. In Memo. No. 24555/788/FR.II/84-1, dt. 5-10-1984 a clarification was issued to this G.O. stating that the pay may be fixed at the minimum of the scale of the new post, and if this pay happens to be less than the pay drawn from the previous post, then the shortfall in pay should be protected as personal pay to be absorbed in future increases. The sole ground on which these instructions were issued was that junior shall not draw higher pay than his seniors by virtue of his holding a post before selection by APPSC.
3. Consequently and in view of the judgement of Supreme Court orders were issued in G.O.6th read above providing for pay protection, which was confined to the government servants only. According to the said orders, “this benefit shall be confined to the Govt. employees only. The employees working in central Govt. Universities, aided Institutions etc., who are appointed to the Govt. service on selection by the A.P.P.S.C.. or Dist. Selection committee are not eligible for the benefit provided under sub-clause (iv).
4. According to Rule 39 © of A.P. State and Subordinate service rules, a person in the service of the government, who applies for direct recruitment and accepts the new post will retain all benefits accrued to him in the previous post except the lien which he has held over will come to an end.
5. In the wake of orders mentioned above, the request of the A.P. Secretariat Association has been examined and the Government is of the view that as the word “provincialisation of services” is no where defined in the Acts or the Rules and as at
present the salaries are being paid through Treasuries from 10-12-2004 under the Head of
Account “010. Salaries” the benefit of this protection can be agreed to the employees
who are appointed after . 10-12-2004.
6. In the circumstances stated above, Government hereby order that the former employees of local bodies who are appointed later through A.P.P.S.C. and D.S.C., in Govt. Service on or after 10-12-2004, and who are continuing in government service as on today be given pay protection under F.R 22(a) (iv) with monetary benefit from the date of issue of these orders.
Rc.No:203, Dt: 30.6.14 :: Constitution of District wise teams and Academic Cell to Monitor SSA, RMSA & Teacher Education Activities
Rc.No:203/B/Plg/APSCERT/2014, Dt: 30.6.2014 :: SCERT, AP - Academic Monitoring of SSA, RMSA & Teacher Education Activities- Constitution of District wise teams and Academic Cell – Order - Issued - Reg.
References:
1. Commissioner & Director of School Education/SPD. RVM. Andhra Pradesh Review Meeting conducted on 21.06.2014 at Krishna Hall. O/o SPD, SSA,A.P., Hyderabad.
ORDER:
The District Wise teams has been constitutedi with the following SCERT Faculty to monitor the SSA & RMSA activities in the State of Andhra Pradesh to ensure effective implementation of the programmes.
District Teams
Further, Academic Cell has also been constituted with the following officers to prepare report on the observations submitted by the district wise teams including actionable points so as to consolidate report.
2. Academic Cell:
1. Sri. K. Panduranga Swamy, Professor
2. Sri. K. Narayan Reddy. Lecturer
The terms of references and Checklists for the District-wise teams and Academic Cel are enclosed herewith (Annexure- I & II).
They are therefore requested to go through the above terms of references & checklist: and cause academic monitoring of the SSA & RMSA;activities in their allotted districts and submit report to the Academic Cell, so as to conisolidate the same and submit to thf C&DSE.A.P., I lyderabad for taking further course action.
This has got the approval of the Commissioner & Director of School Education. A.P., Hyderabad
Annexure – I
Terms of reference for the District Teams aid Academic Cell:
1. Teams shall visit the districts twice in a mor'th @ 2 days per district and monitor the academic activities in all the allotted districts. Visits shall be taken up preferably during 2nd and 4th weeks of a month.
2. A plan of action shall be prepared by the teams well in advance for district tours to observe various items as per the checklist provided and it may be shared with the DEO & PO, RVM to ensure the visits as per t he plan.
3. The teams shall observe the implementation of all the activities as far as possible as per the checklist during every visit so that they may observe the improvement if any taken place by the next visits
4. Teams should meet DEO and PO of RVM,of the concerned districts to take their feed back on the implementation of the activities and share the observations made. They may share their observations with the concerned RJDs also.
5. After completion of the visits, a report in a descriptive form along with key observations and actionable points shall be furnished to the academic cell to he constituted in the O/o. SCERT. AP.
6. The teams shall visit the allotted districts every month compulsorily until further orders.
7. The academic cell should convene a mectirig during the 1st week of every month with all the teams under the chairmanship of the Director. SCERT to share the observations of the teams and prepare a c nsolidated report including actionable points so as to submit to the C&DSE for taking further course of action.
8. Academic cell will be the overall responsible for implementation of the monitoring Programme.
Note: All the DEO’s are informed that the observer’s list is here by enclosed to take necessary further action accordingly.
Checklist for teams:
The teams shall observe the implementation of the following activities during their visits:
• Quality Initiative - conduct of t acher trainings under SSA & RMSA. utilization of school grants, maintenance grants. teacher grants. Radio programmes. activity based approach in teaching learning process. completion of projects by children, individual attention on backward children, completion of syllabus las per plan.
• Utilization of libraries issue of books to the children
• Attendance of teachers and pupil)
• Functioning of special training centres for out of school children. seasonal hostels.
• Implementation of Computer Aided Learning in UP Schools.
• CCE - Implementation. conduct of formative and summative tests. maintenance of records, sharing of children progress with parents. etc. School management committees conduct of meetings. monitoring of school activities, etc.
• Inclusive Education - functioning of Resource Centres. Home Based Education. conduct of screening tests, visits of Inclusive Education Resource Persons, payment of esIcort allowance.
• Conduct of school complex meetings
• Supply of uniforms and textbooks to the children
• Availability of drinking water, toilets and electricity supply in schools
• Functioning of Residential Schools for urban deprived children
• Working and efficiency of part time teachers
• Functioning of KGBV Schools
• Support to Madarsas and implementation of formal curriculum
• Visits of schools by MEOs and CRPs
• Watching of Mana TV progrannnies
• Implementation of Computer Education programme in High Schools
• Implementation of Mid-day Meal
• Other activities of SSA & RMSA
• Functioning of ELTCs
• Implementation of Teacher Education activities and running of D.Ed. course in DIETs.
Popular Posts
-
G.O.Ms.No.182, Dt:22-05-2014 :: Public Services - Scheme of Compassionate Appointments to the dependents of Government employees who ...
-
Results Of Notification No. 11/2011 , Departmental Tests NOVEMBER 2010 Results View H...
-
Hall Ticket download : Notification ...
-
Model school Syllabus Structure for PRINCIPALS: PRINCIPALS EXAM PATTERN: Part – I: Essay Type (Marks: 25) CONTEMPORARY SOCIAL, ECONOMIC AND...
-
ఆంధ్ర ప్రదేశ్ సెలవు నిబంధనలు ( A.P.LEAVE RULES ) :: కూర్పు-సి.హెచ్.రవి, యు.టి.ఎఫ్.రాష్ట్ర కార్యదర్శిఆంధ్ర ప్రదేశ్ సెలవు నిబంధనలు
-
The A.P Treasuries Department in its website has introduced the application for Health Cards of Employees. 1. Go to https://treasury.ap.go...
-
Dear teachers, The question banks prepared by IASE, kurnool are very use ful for March 2019 Exams and some of the models are given in PS ...
-
https://groups.google.com/group/gunasri/attach/a1d5bb485edfc4bd/newschool.pdf?part=4